Soul inspiration

ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న ........

నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కాని ఆత్మ ఎలా ఉంటుంది ?

గురువు గారు ఇలా అన్నారు ........... ,



పాలు ఉపయోగపడేవే , కానీ ఒక్కరోజుకు మించితే పాడైపోతాయి .....

పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది ........

పెరుగు మరొక రోజు వరకూ ఉపయోగపడుతుంది ........

కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది .........

పెరుగును మదిస్తే వెన్న అవుతుంది .......

వెన్న మరొక రోజు వరకే ఉంటుంది .........

తరువాత అది కూడా పాడైపోతుంది .........

ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది .........

ఈ నెయ్యి ఎన్నటికీ పాడవ్వదు .........

ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవ్వని నెయ్యి దాగి ఉంది .

అలాగే అశాశ్వతమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది .

మానవ శరీరము పాలు
సంకీర్తన మజ్జిగ
సేవ వెన్న
సాధన నెయ్యి.

మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ........
ఆత్మ పవిత్రత పొందుతుంది.

No comments:

Post a Comment

EACH GIVES WHAT HE HAS